నవతరం

తెలుగు దినపత్రిక

11 మంది మృతులు మైనర్లే

ఖార్టూమ్ / సూడాన్: తూర్పు సూడాన్లో లో ఓ బంగారు గని పాక్షికంగా కూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మైనర్లే కావడం గమనార్హం. తూర్పు నైలు నది ప్రావిన్స్లోని హౌయిడ్ పట్టణంలో కెర్ష్ అల్-ఫీల్ గని కూలిపోయినట్లు సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రిలో చేర్చించినట్లు పేర్కొంది. దీంతో ఈ గనిలో తవ్వకాలను నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది. బంగారం ఉత్పత్తిలో సూడాన్ ప్రధానమైన దేశంగా ఉన్నప్పటికీ.. భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో ఇక్కడి గనులు కూలడం సర్వసాధారణంగా మారిపోయింది.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading