నవతరం

తెలుగు దినపత్రిక

అంబేద్కర్ అభయహస్తం విజయవంతం

  • ఎస్సి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
  • ఈ పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఇంప్లిమెంటేషన్ చేయాలి

హైదరాబాద్: అంబేద్కర్ అభయహస్తం సాధనకోసం చేవెళ్ల ఎస్సి, ఎస్ టీ డిక్లరేషన్ పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్ని అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత గిరిజన ఆదివాసి జెఏసి నాయకులు, మహా ఎమ్మార్పిస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యపాగ నర్సింగ్ రావ్ మాదిగ, భారత జాతీయ ఎరుకల కులవృత్తుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కండెల వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళిత, గిరిజన, ఆదివాసి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించు కొనుటకు 25 లక్షల రూపాయలను అందించాలి, గత ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారులకు బ్యాంకులో జమ చేసిన, ఫ్రీజింగ్ లో ఉన్న డబ్బులను లబ్ధిదారులకు వెంటనే అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి, చేవెళ్ల ఎస్సి, ఎస్ టీ డిక్లరేషన్ లో ప్రకటించిన 12 అంశాలను వెంటనే అమలు పరచి దళిత గిరిజన ఆదివాసి కుటుంబాల అభివృద్ధికి బాటలు వేయాలని.. పలు అంశాలను తీర్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల లోపు అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన ఆదివాసి ప్రజలను ఏకం చేసి పోరాటానికి సిద్దం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎమ్ఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు జన్ను కనుకరాజ్, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగస్తుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ, ఎస్సి, ఎస్టీ ఐక్యవేదిక ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ముంజగల్ల విజయ్ కుమార్, అరుంధతీయ బందుసేవ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవ్వాజి వెంకటేశ్వర ప్రసాద్, మాదిగ శక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినపాటి రజని, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కళ్లేపెళ్లి రవి, పెర్క రాజమల్లు,తెలంగాణ ఉద్యమ కారుల సంఘం అధ్యక్షులు ఉప్పులేటి రాజేందర్, టాస్ రాష్ట్ర అధ్యక్షులు బొర్గి సంజీవ్, తెలంగాణ రాష్ట్ర జై భీమ్ సేవా సంఘం జనరల్ సెక్రటరీ బేతి విజయ్ కుమార్, జై భీమ్ మహసేన రాష్ట్ర అధ్యక్షులు మంచింటి అంజన్న, తెలంగాణ దళిత బహుజన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల కరుణాకర్, మహా ఎంఆర్పిఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు ముత్యపాగ శ్రీశైలం మాదిగ, మహా ఎంఆర్పిఎస్ మీడియా ఇంచార్జ్ రాగాల ఆనంద్ కుమార్ మాదిగ, మాడగాని లింగయ్య, శారద, భాగ్యమ్మ, తరుణ్, వనం సుందర్, వనం గంగయ్య, గంగాధర్, వీరన్న, అంజయ్య, జగన్నాథం, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading