నవతరం

తెలుగు దినపత్రిక

సావిత్రిబాయి బాటలో మనమందరం నడవాలి

కుత్బుల్లాపూర్, నవతరం: భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా… సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ తెలుగుతల్లి నగర్ లో కళాకారుడు శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేమ్స్. అనంతరం వారు మాట్లాడుతూ భారత తొలి ఉపాధ్యాయురాలు పురుషులు స్త్రీలు సమానత్వంగా ఉండాలని విద్య అందరికీ అందాలని కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త వారి యొక్క బాటలో మనందరం నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, వెంకటస్వామి, తారా సింగ్ నాయక్, శ్యామ్, ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి, బద్రి, నారాయణ రాధాకృష్ణ, రమేష్, నిరంజన్, లక్ష్మణ్, శ్యామ్, అలీ బాయ్ మహిళ నాయకులు శీలం కుమారి, రాణి, త్రివేణి, నర్మదా, నాగలక్ష్మి, జైశ్రీరామ్ నగర్ కమిటీ సభ్యులు, మైత్రినగర్ వాసులు, ఆర్జీకే వాసులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading