నవతరం

తెలుగు దినపత్రిక

బడి బయట పిల్లలను బడిలో చేర్పించండి

• ప్రధానోపాధ్యాయుడు కవిరాజు

పెద్దవంగర, నమస్తే ఎల్లంపల్లి: బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని పెద్దవంగర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపాక కవిరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన సీఆర్పీలతో కలిసి బడి బయట పిల్లల ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా కవిరాజు మాట్లాడుతూ..బడీడు పిల్లలందరినీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఈనెల 18 వరకు ఇంటింటి సర్వే చేపడుతుందని తెలిపారు. ప్రత్యేక కార్యచరణతో 0-14 సంవత్సరాలు, 15-19 సంవత్సరాల వయస్సు గల బడి బయట పిల్లల వివరాలను సేకరించి, స్థానిక పాఠశాలలో చేర్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఆర్పీలు నిరంజన్, రమాదేవి పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading