నవతరం

తెలుగు దినపత్రిక

మానవతాజీవి కాశీనాథ్ యాదవ్

* అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన కాశీనాథ్ యాదవ్

మేడ్చల్ జిల్లా/కూకట్ పల్లి/జనవరి17, నమస్తే ఎల్లంపల్లి: ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన ఎం రమేష్ 32 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకొని అతని కుటుంబానికి సాయం చేయడానికి 124 డివిజన్ వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్ ముందుకచ్చి వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన ఏ కుటుంబానికైనా సరే నేను సాయం చేయడానికి ముందుంటనని తెలియజేశారు. ఈ రోజు యాదవ కుటుంబానికి సంబంధించి సమస్య వచ్చిందని తెలుసుకొని వెంటనే సాయం చేయడానికి ముందుకు వచ్చానని కాశీనాథ్ తెలియజేశారు. భవిష్యత్ లో యాదవ కులస్థులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్న నా వంతు సహాయం తప్పక ఉంటుందని అన్నారు.

ఆర్థిక సాయం అందజేస్తున్న కాశీనాథ్ యాదవ్

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading