నవతరం

తెలుగు దినపత్రిక

జ్యోతిబాపూలే ఆశయాలతో ముందుకు సాగుదాం

యువనాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: రామాయంపేట పట్టణంలో జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ముఖ్యఅతిథిగా కాసాని విరేష్ ముదిరాజ్ పాల్గొనడం జరిగింది. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాసాని వీరేష్ ముదిరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే తన ఆశయాలు సాధన నీ మా ధ్యేయం వారి అభ్యుదయ సాధన నే ధ్యేయంగా తన జీవితాన్ని సాగించి మహాపురుషుడు జ్యోతిబా పూలే తనను తనతో పాటు తన భార్య సావిత్రిబాయి పూలే ను కూడా సమాజ సేవకు అంకితం చేసి గొప్ప సంఘ సంస్కృత జ్యోతిబాపూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీకాంత్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు రాజు ముదిరాజ్, నియోజకవర్గ అధ్యక్షులు సాయిబాబా ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, అశ్విని ముదిరాజ్, మాజీ ఎంపిటిసి సత్యనారాయణ, ఈ కార్యక్రమంలో జ్యోతిబాపూలే అభిమానులు కాసాని అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading