నవతరం

తెలుగు దినపత్రిక

టీయూడబ్ల్యూజే టీజెఫ్ నేతల అరెస్టు

హైదరాబాద్, నవతరం: కొత్త జీవో పేరుతో జర్నలిస్టుల ఆక్రిడేషన్ లను కోత పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుత పద్ధతిలో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన టీ యూడబ్ల్యూజే టీజెఫ్ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు పోలీసులు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఉపాధ్యక్షులు రమేశ్ హజారి, కోశాధికారి యోగానంద్, టెంజు అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, ఐజేయూ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, హైదరాబాద్ జిల్లా ఇంచార్జీ నవీన్ కుమార్, నేతలు బాపురావు, భాస్కర్, ప్రెస్ క్లబ్ మెంబర్ అశోక్ దయాళ్, వీ5 సీఈఓ కడకంచి వెంకట్, సువర్ణ, రామకృష్ణ రెడ్డి, దేవేందర్, సంతోష్, తదిరులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టు లను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading