*అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న యువత నాయకులు ఆనంద్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి
బొల్లారం, నమస్తే ఎల్లంపల్లి: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి మండపం వద్ద సోమవారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతీ దేవి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ యువత నాయకులు ఆనంద్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి సరస్వతి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు రవితేజ, సునీల్, మోహన్, బబ్లు, అనసు, రవి, కాలనీవాసులు, భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.