కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: తన చల్లని చూపులతో.. చక్కటి సంతకాలతో తమను చల్లగా చూడాలని ఇక్కడి ‘కబ్జా బ్రదర్స్’ ఆ సంతకాల తల్లిని నీవు చల్లగా ఉండు తల్లి అని కోరుకుంటున్నారంట. మొన్నటివరకు తమకు నిలువ నీడ లేదు, కనీసం సొంత ఇల్లు లేదు అని మొర పెట్టుకున్న ఆ కబ్జాల తల్లి, ప్రస్తుతం ఒక బస్తీకే కబ్జాల తల్లిగా అవతారమెత్తింది. గాజులరామారం సర్వే నంబర్ 329/1, 307 లోని ప్రభుత్వ, ఏపీఎస్ఎఫ్సీ భూముల్లోని ప్లాట్ ల అమ్మకాల నోటరీలపై ఆ తల్లి సంతకాలు పెడుతుంది, ఈ తనయులు తందనాలాడుతారంటూ స్థానిక ప్రజలు ముక్కుతో నవ్వుతున్నారు. గాలిపోచమ్మ బస్తీ మొదట ఒక్క నిర్మాణానికి నోచుకోకున్నా.. ఈ కబ్జా బ్రదర్స్ నకిలీ సంతకాలు, ఫోర్జరీ డాక్యుమెంట్ లు తయారు చేసి ప్లాట్ లు అమ్మి కొన్ని లక్షలు దండుకున్నా.. మొదట వీరికి కలిసి రాలేదంట. అంతే, కేసులకు భయపడో.. అమ్మ దీవెన ఉంటే చాలనుకున్నారో ఏమో.. ఈ కబ్జాల తల్లి పేరుతో నోటరీలు చేయటం, ఆ తల్లితో సంతకాలు పెట్టించడం ద్వారా తమకు కలిసొచ్చిందంటున్నారు ఈ కబ్జా బ్రదర్స్.. అంటున్నారు ఈ సంతకాల సంగతి తెలిసినవాళ్ళు. అందుకే అంటారు చల్లగుండు కబ్జామాత.. మమ్మల్ని చల్లగ సూడు అని.. అంతేగా.. అంతేగా..?
చల్లగుండు కబ్జామాత… నీ చక్కటి సంతకాల చేత



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































