క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: సుభాష్ నగర్ డివిజన్ పరిధి సుందర్ నగర్ లోని సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇన్నారెడ్డి నివాసంలో ఈరోజు జరిగిన క్రిస్మస్ వేడుకలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా క్రైస్తవులతో కలిసి కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు హేమలత సురేష్ రెడ్డి, మంత్రి సత్యనారాయణ, మహ్మద్ రఫీ, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రాజు, గాజులరామారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, బాల్ రెడ్డి, రాము, ఫాదర్ విజయ్, ఫాదర్ జోజి రెడ్డి, బస్తీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.












































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.