నవతరం

తెలుగు దినపత్రిక

కార్పొరేటర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: కార్పొరేటర్ జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో జరిగిన జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ జన్మదిన వేడుకలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జగన్ తో కేకును కట్ చేయించిన ఎమ్మెల్సీ శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు, మహిళలు, పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading