నవతరం

తెలుగు దినపత్రిక

మంచినీరు, డ్రైనేజీ సమస్య త్వరగా పరిష్కరించండి

* జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సంజయ్ పురి కాలనీలో మంచినీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలపై ఈరోజు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో జలమండలి డైరెక్టర్ పర్సనల్ స్వామి, జలమండలి జిఎం శ్రీధర్ రెడ్డితో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ జగన్ మాట్లాడుతూ కాలనీలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్ మల్లేష్ గౌడ్, వెంకటేశ్వర్లు, దామోదర్ రావు, అప్పల శ్రీను, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, కిరణ్, వెంకటేష్, లక్ష్మణరావు, అరవింద్, నరసింహ చారి, మాణిక్చంద్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading