* పేట్ బషీరాబాద్ సయ్యద్ నగర్ లో ఎమ్మెల్యే పర్యటన
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని పేట్ బషీరాబాద్ సయ్యద్ నగర్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక సమస్యలపై పర్యటించారు. ఈ మేరకు భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి ద్వీపాలు, 58 జీవో ద్వారా పట్టాలు అందించాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందిరా రెడ్డి, సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, కాలే నాగేష్, గణేష్, అనీల్, స్థానికులు కమలాకర్, యాసిం పాష, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.