నవతరం

తెలుగు దినపత్రిక

మిషన్ భగీరథ పైప్లైన్లను ప్రారంభించిన కార్పొరేటర్

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సోమయ్య నగర్, జగద్గిరినగర్ ప్రాంతాలలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్తగా వేసినటువంటి మిషన్ భగీరథ మంజీరా పైపులైన్లను స్థానిక కార్పొరేటర్ కోలుకుల జగన్ ప్రారంభించారు. బస్తీలలో కార్పొరేటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్ సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరినారు. ఈ కార్యక్రమంలో సోమయ్య నగర్ అధ్యక్షులు యాదగిరి, విట్టల్ ముదిరాజ్, నరసింహారెడ్డి, మనోజ్, ఇంద్ర గౌడ్, వరలక్ష్మి, శాంతమ్మ, రాజు, చిన్న, ప్రకాష్, సత్తిరెడ్డి, రామ్ శెట్టి, ప్రభాకర్, నర్సింగ్ గౌడ్, విగ్నేష్, సత్యం చారి, అంజి, రమేష్, కార్తీక్, సురేష్, మరియు వాటర్ వర్క్స్ వర్క్ ఇన్స్పెక్టర్ రిజ్వాన్, జిహెచ్ఎంసి ఏఈ తిరుపతి, వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పైప్ లైన్లను ప్రారంభిస్తున్న జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading