నవతరం

తెలుగు దినపత్రిక

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డివిజన్ గాజులారామారం, రంగారెడ్డి నగర్ డివిజన్ యువజన నాయకులు, కేంద్ర రాష్ట్ర వైఫల్యాల పై నిరంతరం పోరాటం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై గాజులరామారం, రంగ రెడ్డి నగర్ వాసులు షేక్ ఇమ్రాన్ మొహమ్మద్ యూసఫ్, దీపక్, రాకేష్, ఎస్ డి.మొబిల్, ఎం డీ.వహిత్, ఎం డీ.అజమ్, ఎం డీ. మనోహర్ 125 డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ షఫీ అద్వర్యంలో, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తాను మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభత్వం వచ్చాక ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల సాయం, ఆడ బిడ్డలకు 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండ ఎగర వేయడం ఖాయమని అన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading