మెదక్, నవతరం: సమస్యాత్మక పోలింగ్ స్టేషన్గా గుర్తించబడిన రాజ్పల్లి పోలింగ్ బూత్ను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు అందిస్తూ, పోలింగ్ కేంద్రంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ సమయంలో ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్ఐ శైలందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎసైలు, సిబ్బంది పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.