నవతరం

తెలుగు దినపత్రిక

ఎట్ హోమ్ కు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి

హైదరాబాద్, నవతరం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, పలువురు పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర ప్రముఖులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading