నవతరం

తెలుగు దినపత్రిక

రూ. కోటి 25 లక్షల 11 వేల 116 ఫిక్స్ డిపాజిట్

  • జోగులాంబ ఆలయం పేరిట 1 కోటి 25 లక్షల 11 వేల 116 ఫిక్స్ డిపాజిట్

అలంపూర్, నమస్తే ఎల్లంపల్లి: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల అభివృద్ధి కొరకై రూ.1కోటి 25 లక్షల 11 వేల 116 రూపాయలను శుక్రవారం ఏపీజీవీబీలో ఫిక్స్ డిపాజిట్ చేసినట్టు జోగులాంబ ఆలయ పాలకమండలి చైర్మన్ బెక్కం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తమ పాలకమండలి హయాంలో అనతికారంలోనే చేసిన అభివృద్ధి పనులను వారు వివరించారు అదేవిధంగా ఆలయ ఈవో పురేందర్ కుమార్ సహకారంతో ఇంత పెద్ద మొత్తాన్ని ఎఫ్ .డి చేయగలిగామన్నారు. దేవస్థానానికి ఏపీజీవీబీ అందిస్తున్న సహకారాన్ని సేవలను ఆలయ పాలకమండలి కొనియాడింది

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading