నవతరం

తెలుగు దినపత్రిక

జోగుళాంబ వార్శిక బ్రహ్మోత్సవాలకు రండీ

* కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆహ్వానం
* ప్రముఖులను ఆహ్వానించిన ఆలయ చైర్మె, ఇఓ, ప్రధాన అర్చకులు

అలంపూర్, నమస్తే ఎల్లంపల్లి: అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తు గురువారం కలెక్టర్ కోటేశ్వర రావు, ఎస్పీ సిద్దార్ధ కౌశల్, ఎంపీ సంజీవ్ కుమా, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ని కలిశారు. ఈ మేరకు జోగుళాం ఆలయ ఇఓ పురేంధర్ కుమార్, చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ లు కలసి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ప్రసాదాలను శేష వస్త్రాలను అందజేశారు. ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని 26వ తేదీ వసంత పంచమి సందర్భంగా జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని, జోగులాంబ అమ్మవారి దర్శించుకోవాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading