నవతరం

తెలుగు దినపత్రిక

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

  • అస్వస్థకు గురైన 11మందివిద్యార్థులు
  • హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ తరలించిన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్, నమస్తే ఎల్లంపల్లి: హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అస్వస్థకు  గురై  సొమ్మసిల్లి పడ్డారు ఇది గమనించిన సిబ్బంది దగ్గర్లో ఉన్న ఏరియా హాస్పిటల్ కి తరలించారు తదనంతరం వారు మాట్లాడుతూ శనివారం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులు ఖర్జూర పండ్లు  ఇచ్చి వెళ్లారు సదరు విద్యార్థి తనతో పాటు అతను స్నేహితులైన మరో పదిమంది విద్యార్థులకు ఖర్జూర పండ్లు ఇచ్చాడు ఖర్జూర పండ్లు తిన్న కాసేపటికి వాంతులు వీరోచనాలతో విద్యార్థుల తీవ్రఅస్వస్థకు గురి అయ్యారు కాలపరిమితి దాటిన ఖర్జూర పండ్లు తినడం ద్వారా జరిగి ఉండా వచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుటాహుటిన ఏరియా హాస్పిటల్ కి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిలో అడిగిమరీ తెలుసుకొని పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఉన్నత వైద్యులను కోరారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading