నవతరం

తెలుగు దినపత్రిక

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: సూరారం డివిజన్ పరిధిలోని కళావతి నగర్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వద్ద నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మన్నె రాజు, ఎత్తరి మారయ్య, సిద్ధిక్, మధు మోహన్, పాస్టర్ ఆనంద్ బాబు, మల్లేష్, అన్ను, దశరథ్, రాజు యాదవ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading