నవతరం

తెలుగు దినపత్రిక

Cyberabad Police Commissionerate Annual Round Up 2022

  • నేరాలు తగ్గినా, సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి
  • సీపీ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గత ఏడాదితో పోలిస్తే సాధారణ నేరాలు సైబరాబద్ పరిధిలో 12% మేర తగ్గాయని, అదే సమయంలో సైబర్ నేరాలు మాత్రం 28. 84% పెరిగినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కానిస్టేబుల్ నుండి సిపి వరకు అందరూ కృషి చేయడం వల్లే మొత్తం నేరాల సంఖ్య తగ్గినట్లు తెలిపారు.

అదేవిధంగా, సైబర్ నేరాల పైన ప్రత్యేక దృష్టి సారించి వాటిని తగ్గించే విధంగా పని చేయాలని కోరారు. సాధారణ నేరాల కంటే సైబర్ నేరాలను ఛేదించడం చాలా కష్టమైన పని అని అన్నారు. ఈ క్రమంలో కింది స్తాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు కలిసికట్టుగా పనిచేసి సైబర్ నేరాలను తగ్గించాలని కోరారు. గడిచిన 10 సంవత్సరాలలో 80% కేసులు సైబరాబాద్ పరిధిలో దర్యాప్తు పూర్తి చేసినట్లు తెలిపారు.

Cyberabad Police Commissionerate Annual Round Up 2022 – CP Stephen Raveendra IPS

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading