నవతరం

తెలుగు దినపత్రిక

జడ్జి శ్రీపతి ని అభినందించిన ఎంకే స్టాలిన్

* 23 ఏళ్లకే జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి

నవతరం, తమిళనాడు: తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఓ గిరిజన యువతి తొలిసారి సివిల్ జడ్జిగా ఎంపికయ్యింది. సివిల్ జడ్జిగా ఎంపికైన 23 ఏళ్ల శ్రీపతిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీపతి అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె వైద్యులు ప్రమాదమని వారించినా ధైర్యం చేసింది.రెండు రోజుల పసికందుతో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ జడ్జ్ పరీక్ష రాసిన శ్రీపతి ఉద్యోగానికి ఎంపికై చరిత్ర సృష్టించింది.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading