* 74 ఏళ్ల పాత చట్టంతో బిజెపి సర్కార్ షాక్ ఇచ్చింది
అస్సాం: అస్సాంలోని బంగ్లాదేశ్ పౌరులను 24 గంటల్లోనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ, అస్సాం ప్రభుత్వం 1950 నాటి ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం యాక్ట్ ను అమలు చేసింది. అక్రమ వలసదారుల కేసులు సాధారణంగా సంవత్సరాలు సాగుతాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఈ అరుదైన చట్టం ద్వారా తక్షణ బహిష్కరణకు ఆదేశించడం భారత చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఈ చట్టం ప్రకారం, అస్సాం ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా రాష్ట్రంలోకి వచ్చిన లేదా ఉన్న వ్యక్తులను తక్షణమే బహిష్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.












































































































































































































































































































































































































































































































































































































